{"product_id":"kovvali-navalalu-2","title":"Kovvali Navalalu-2","description":"\u003cp\u003eవందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో ‘పల్లెపడుచు’ అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల ‘మంత్రాలయ’.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eతన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058533195823,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/kovvalinavalalu2.jpg?v=1773687187","url":"https:\/\/books.ataka.in\/products\/kovvali-navalalu-2","provider":"అటక","version":"1.0","type":"link"}