Skip to product information
Anandamatham & Indira

Anandamatham & Indira

Rs. 50.00

వంగ సంవత్సరం 1176. వేసవికాలంలో ఒకరోజు. పదచిహ్న గ్రామం అనే పేరుగల ఆ వూళ్ళో ఎండవేడిమి మిక్కుటంగా వుంది. గ్రామంలో అనేక ఇళ్ళు వున్నాయి. అయితే మనుషులు యెవరూ అగుపించడం లేదు. ‘పదచిహ్న’ గ్రామంలో గణనీయమయిన వ్యక్తి ‘మహేంద్రసింహుడు’. అతడు చాల ఐశ్వర్యవంతుడు. అయినా ఈ కరువు మూలంగా బీదవారు, భాగ్యవంతులు ఒకటే అయిపోయారు. పెద్ద పెద్ద ఇళ్ళూ, భవంతులూ, మేడలు - అన్నీ జనశూన్యంగా వున్నాయి. అందరూ పట్టణం నుంచి పారిపోయారన్నమాట! మహేంద్రుడు తన భార్యను, కుమార్తెను ఒక ఇంటిలోనికి తీసుకువెళ్లాడు. వారిని లోన కూర్చుండజేసి, ఆ ఇంటిలో ఎవరైనా పలుకుతారేమోనని పిలిచాడు. బదులులేదు. తరువాత కళ్యాణితో ‘‘కొద్దిసేపు ధైర్యంగా ఇక్కడే వంటరిగా కూర్చో. నేను బయటకు వెళ్ళి కాసిని పాలు దొరుకుతాయేమో చూచి తీసుకువస్తాను’’ అని మహేంద్రుడు మట్టిపాత్ర తీసుకుని బయటకు వెళ్ళాడు. ఇక చదవండి.

You may also like