Manobhiramam
మనోభిరామం
శౌరి యశస్విల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది! కాని శ్రీశైల ప్రయాణంలో ఎదురైన ప్రమాదం వారిద్దరి మధ్య వున్న అపోహలను తొలగించింది.
తీరా తిరిగి హైదరాబాదు చేరుకోగానే శౌరి పినతండ్రి మూలంగా వారిద్దరి మధ్యా మనఃస్పర్థలు కలుగుతాయి. ఓ ఇరవై లక్షలు, సేఠ్ పన్నాలాల్ దగ్గర అప్పు తీసుకుని అది తీర్చకుండానే శౌరి తండ్రి మరణిస్తాడు.
ఆ డబ్బు యశస్వి కోసమేనని పినతండ్రి చెబుతాడు. ఆ డబ్బు ఎక్కడ కట్టాలో అని యశస్వి శౌరిని కలుసుకోవటం లేదని ఎక్కిస్తాడు. అసలు వీరిద్దరి మధ్యా వున్న ఆ అపోహలేమిటి? అవి ఎట్లా తొలగిపోతాయి? శౌరి పినతండ్రి మూలంగా వచ్చిన మనఃస్పర్థలు ఏమౌతాయి?
శౌరి జీవిత పోరాటాన్ని యశస్వి ఎట్లా తన పోరాటంగా స్వీకరించాడు?
ఇవన్నీ తెలుసుకోవాలంటే అశేష ఆంధ్ర పాఠకుల అభిమాన రచయిత్రి.
యద్దనపూడి సులోచనారాణి సుమధుర నవల "మనోభిరామం" చదవండి!