అరవై ఏళ్ల క్రితం తొలిసారిగా ప్రచురించబడి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక తుఫాన్ వంటి ప్రభావాన్ని సృష్టించిన వినుకొండ నాగరాజు రచించిన 'ఊబిలో దున్న' నవల, ఇప్పుడు 2025 స్పెషల్ ఎడిషన్ రూపంలో తిరిగి పాఠకుల ముందుకొస్తుంది. ఈ నవల కేవలం కాలక్షేపం కోసం చదివే ప్రేమ కథ కాదు. ఇందులో ప్రధానంగా, ఒక మనిషి బురద ఊబిలో కూరుకుపోయిన దున్నపోతును రక్షించడానికి చేసే మహత్తరమైన, ధృఢమైన ప్రయత్నాన్ని చిత్రీకరించారు. ఈ కథ కేవలం దున్నపోతు గురించి కాదు. ఈ ఊబి, నేటి సమాజం రాజకీయంగా, పరిపాలనాపరంగా చిక్కుకుపోయిన ప్రతిష్టంభనకు సంకేతం. ఈ ప్రతిష్టంభన నుంచి లంటే ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతను గుర్తించి, నిర్ణయాత్మక ప్రయత్నాలు చేయాలనే సందేశాన్ని ఈ నవల సూచిస్తుంది. సుమారు 60 సంవత్సరాల క్రితం రచయిత వ్యక్తం చేసిన యువతరం పడుతున్న నిస్సహాయ ఒత్తిడి, ఆత్మవిశ్వాసం, ధైర్యం లేకపోవడం వంటి లోతైన అంశాలు నేటికీ వర్తిస్తాయి కాబట్టే ఇది ఒక టైంలెస్ నవల. వినుకొండ నాగరాజు గారి సామాజిక విమర్శ ఎంత తీవ్రంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డును కూడా తిరస్కరించారు. తెలుగు ప్రచురణ చరిత్రలో ఇలా గట్టిగా ఎదురు తిరిగిన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రపంచ సాహితీ వేదికపై నిలబడే విలువ కలిగిన ఈ రచనను, ప్రయోజనాత్మక సాహిత్యాన్ని ఆదరించే ఈతరం పాఠకులు తప్పక చదవాల్సిన శక్తిమంతమైన నవల ఊబిలో దున్న.